విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీ రైస్ మిల్ ఓనర్గా కనిపించనున్న ఈ చిత్రంలో… చైతు ఆర్మీ ఆఫీసర్గా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో… మిలటరీ నేపథ్యంలో సాగే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. వీటిలో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని… ప్రస్తుతం వాటి చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది. వెంకీ, చైతు… ఇద్దరూ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారట.
డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా… దసరా కానుకగా ‘వెంకీమామ’ విడుదల కానుందని ప్రచారం సాగుతోంది.
[subscribe]
[youtube_video videoid=bJAKvOx_UE4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: