`పంజా`, `బలుపు` చిత్రాలలో నెగెటివ్ రోల్స్లో అలరించిన అడివి శేష్… `క్షణం`, `అమీ తుమీ`, `గూఢచారి` చిత్రాలతో కథానాయకుడిగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో `2 స్టేట్స్` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే… అప్పుడప్పుడు అతిథి పాత్రల్లోనూ మెరిసే శేష్… మరోసారి అలాంటి పాత్రలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్గా తెలుగులో ఓ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని నందినీ రెడ్డి రూపొందిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు… కథలో భాగంగా వచ్చే ఓ అతిథి పాత్రలో అడివి శేష్ కనిపించనున్నాడని సమాచారం.
ఇదివరకు… సమంత మామయ్య అక్కినేని నాగార్జున నటించిన `ఊపిరి`లో అనుష్క భర్తగా అతిథిగా కనిపించాడు అడివి శేష్. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్… నాగ్ కోడలు సామ్ కి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి. `బేబి.. ఎంత సక్కగున్నావె` అనే పరిశీలనలో ఉన్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: