విష్ణు బర్త్డే సందర్భంగా ఢీ సీక్వెల్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సారి “డబుల్ డోస్”(ఢీఢీ) తో వస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమా ఢీ కి సీక్వెల్ అని.. ఆ రేంజ్ లో ఉంటుందా అన్న వార్తలు అప్పుడే మొదలయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన శ్రీనువైట్ల క్లారిటీ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీను వైట్ల ఈ సినిమా సీక్వెల్ కాదని చెపుతున్నాడు. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సీక్వెల్ కాదని.. శ్రీహరి లేకుండా ఈ సీక్వెల్ సాధ్యం కాదని.. ప్రస్తుతానికి శ్రీహరి లేరు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చేసిన జెనీలియా కూడా పెళ్లిచేసుకొని ముంబాయిలో సెటిల్ అయింది.. వాళ్ళు లేకుండా సీక్వెల్ కష్టం అని చెప్పాడు. చూద్దాం మరి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారో.. కాగా ఇద్దరు లెజెండరీ నటులు ఇప్పుడు లేరు. రియల్ స్టార్ శ్రీహరి 2013లోనే చనిపోతే.. జయప్రకాశ్ రెడ్డి ఈ మధ్యే సెప్టెంబర్ 8న మరణించారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇక గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో శ్రీను వైట్ల కాస్త వెనుక పడ్డాడు. శ్రీను వైట్ల అయితే బాద్షా తర్వాత పూర్తిగా గాడి తప్పాడు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలతో ఆల్ మోస్ట్ కనుమరుగు అయిపోయాడు. అందులోనూ కొత్త కొత్త డైరెక్టర్స్.. కొత్త టాలెంట్ వస్తుండటం.. పోటీ ఎక్కువవుతుండటంతో శ్రీను వైట్లతో సినిమా చేయడానికి కూడా నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితి ఏర్పడింది. చూద్దాం ఈ సినిమాతో అయినా గాడిలోకి వస్తాడేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: