కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు చెర్రీ కూడా తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే గత కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లాలో మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరిపారు. అక్కడ చిరంజీవి, చరణ్ల మధ్య సన్నివేశాలను.. ఒక పాటను కూడా చిత్రీకరించినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఖమ్మం జిల్లాలో విపరీతమైన ఎండల కారణంగా షూటింగ్ ను అర్ధాంతరంగా ఆపేశారని… చిరంజీవి హైదరాబాదుకు చేరుకున్నారనే వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈవార్తలపై స్పందించిన చిత్రయూనిట్.. అలాంటిదేమీ లేదని, అక్కడి షెడ్యూల్ కంప్లీట్ అయిపోందని అధికారికంగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలిపింది.
Team #Acharya completed a month long schedule in Rajahmundry and Illendu regions of AP and Telangana. Gearing up for a grand world wide release on 13th May, 2021.#AcharyaOnMay13 pic.twitter.com/gPloJTJvCb
— Matinee Entertainment (@MatineeEnt) March 10, 2021
ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మే 13 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: