14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. క్యూట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ మూవీ లో సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శ్రీకారం “మూవీ సక్సెస్ గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సె మీట్ ను 12 వ తేదీ జరుపుకుంది. నిర్మాత ఆచంట గోపి మాట్లాడుతూ .. హీరో శర్వానంద్ కెరీర్ లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిందనీ ,మూవీ కి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందనీ , ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి మంచి వసూళ్ళు రాబడుతుందనే నమ్మకం ఉందనీ చెప్పారు. రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ .. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారనీ , ఇంతటి ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందనీ చెప్పారు. దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ .. కథ లోని కొన్ని సీన్స్ కు అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్ వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. యూత్ ఖచ్చితంగా చూడాల్సిన చిత్రమని దర్శకుడు అజయ్ భూపతి , దర్శకుడు కథ ను బాగా నరేట్ చేసాడని సాయి కుమార్ చెప్పారు.”శ్రీకారం “ఒక హానెస్ట్ మూవీ అని దర్శకుడు బాబీ , దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ను జెన్యూన్ గా చెప్పారని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పారు.“శ్రీకారం “మూవీని అందరూ ఎంజాయ్ చేస్తున్నారనీ , అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇదనీ హీరోయిన్ ప్రియాంక చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: