మొత్తానికి మన సౌత్ డైరెక్టర్ల హవా బాలీవుడ్ లో బాగానే నడుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే మన వాళ్లు చాలా కష్టపడేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ళే మన వాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు దాదాపు డజనుకుపైగా డైరెక్టర్లు బాలీవుడ్ హీరో లని డైరెక్ట్ చేస్తున్నారు. అది కూడా బాలీవుడ్ సూపర్ స్టార్లనే. మరి వారెవరో ఒకసారి చూద్దామా..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ వంగ బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ రీమేక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సందీప్ వంగ రీమేక్ చేస్తేనే తాను నటిస్తానని షాహిద్ కపూర్ చెప్పాడంటే.. సందీప్ పై ఎంత నమ్మకం ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సినిమాతో హిట్ లేచి ఒమ్ము చేసుకున్నాడు సందీప్ వంగా. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ లోనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. కబీర్ సింగ్ నిర్మాతలు అయిన టీ సీరిస్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇక గత కొంత కాలంగా సరైన హిట్ పడలేదు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ కు. అందుకే ఈసారి సౌత్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అట్లీ. తమిళ్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు అట్లీ. ఇక అట్లీ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన ‘రాజా రాణి’ సినిమాను షారుఖ్ రీమేక్ చేయనున్నాడట. ఇక ఈ రీమేక్ కు అట్లీ నే దర్శకత్వం వహించనున్నాడట. కొద్దీ రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది.
ఇక ముని సీక్వెల్స్ తో ఇక్కడ సక్సెస్ కొట్టిన రాఘవ లారెన్స్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కాంచన సినిమా ఇక్కడ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాను అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు లారెన్స్.
ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటినుండో హిందీలో డైరెక్టర్ గా సెటిల్ అయ్యాడు ప్రభుదేవా. గతంలోనే హిందీలో వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ తో ‘పోకిరి’ రీమేక్ ‘వాంటెడ్’ చేసి సూపర్ సక్సెస్ అందించాడు. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత సల్మాన్ మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేస్తున్నాడు.అంతేకాదు మూడో సినిమా కూడా లైన్ లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
అమిర్ ఖాన్ తో విక్రమ్ వేధా చిత్రాన్ని దర్శక దంపతులు పుష్పర్- గాయత్రీలు తెరకెక్కించనున్నారు. అయితే అమీర్ ఖాన్ కు ఇదే మొదటి సారి కాదు తమిళ్ మూవీని రీమేక్ చేయడం.. గతంలో.. తమిళ్ గజినీ సినిమాతో అప్పట్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి – మాధవన్ నటించిన ఈ మినీ మల్టీస్టారర్ ని పుష్కర్ – గాయత్రీ దంపతులు తెరకెక్కించారు. ఈ సినిమా అక్కడ సక్సెస్ అవ్వడంతో బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు.
ఇక గౌతమ్ తిన్ననూరి దర్సకత్వంలో నాని ప్రధాన పాత్రలో వచ్చిన ‘జెర్సీ’ మంచి ఎమోషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. ‘జెర్సీ’ హిందీ రీమేక్లో నాని పాత్రను షాహిద్ కపూర్ చేస్తుండగా…. తెలుగు వెర్షన్ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, అమన్ గిల్ ఈ రీమేక్ ను నిర్మిస్తున్నారు.
దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమా 2010లో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇదే చిత్రాన్ని దేవ కట్టా హిందీలో అదే టైటిల్ తో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్దత్ నటించడమే కాకుండా స్వయంగా నిర్మించారు కూడా.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: