సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘దర్బార్’. పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే, `దర్బార్` కోసం చాన్నాళ్ళ తరువాత రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో “ఆదిత్య అరుణాచలం” అనే పేరుతో రజినీ అలరించనున్నారని సమాచారం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… గతంలో రజినీ టైటిల్ రోల్ పోషించిన ‘అరుణాచలం’(1997) చిత్రం తన కెరీర్లో మెమరబుల్ మూవీగా నిలవడమే కాకుండా… బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో… ఇప్పుడు అదే స్క్రీన్ నేమ్తో, మళ్ళీ 22 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించనున్న సూపర్ స్టార్… ఈ సారి ఎటువంటి సంచలనాలు సృష్టించనున్నారో చూడాలంటే 2020 సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: