ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ప్రయాణీకులు ప్రమాదాల బారిన పడకుండా భారత దేశ ప్రభుత్వం భారీ జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ గుర్తింపు పేపర్స్, అతి వేగం, ఓవర్ లోడ్ వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారికి భారీ జరిమానాలు విధించమని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను మూవీ 2018 వ సంవత్సరం ఏప్రిల్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లోని ఒక సీన్ లో ట్రాఫిక్ ఉల్లంఘనులకు భారీ జరిమానాలు విధించమని ముఖ్య మంత్రి మహేష్ బాబు అధికారులకు ఆదేశాలు జారీచేస్తారు. భరత్ అనే నేను మూవీ చూసి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ రూపొందించాయని మహేష్ బాబు అభిమానుల వాదన. భరత్ అనే నేను మూవీ సీన్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: