కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నగేష్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయంకానున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ సహనిర్మాతగా వ్యవహరించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా నుండి ఓ ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.
డైరెక్టర్ – నగేష్ కుకునూర్
బ్యానర్ – వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
ప్రొడ్యూసర్ – సుధీర్ చంద్ర
కో ప్రొడ్యూసర్ – శ్రావ్య వర్మ
మ్యూజిక్ – దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్ – చిరన్ తన్ దాస్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
[subscribe]
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: