రాజ్ దూత్ సినిమాతో హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు మేఘాంశ్. మొదటి సినిమాతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మేఘాంశ్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. నేడు ఈసినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, బాబీ కొల్లి , చోటా కె నాయుడు టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మంత్రి తలసాని గారికి, మనోజ్ అన్నకి, బాబీ అన్నకి, చోటా గారికి కృతజ్ఞతలు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను. మా నిర్మాత చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. గోపిసుందర్, రామ్ ప్రసాద్ గారు లాంటి బెస్ట్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. మమ్మల్ని నమ్మి ఇంత భారీగా సినిమాని నిర్మిస్తున్న నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలని తెలిపారు.
దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ.. ఈ కథని ఎక్కడా రాజీపడకుండా గొప్పగా నిర్మిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. గోపిసుందర్, రామ్ ప్రసాద్, ఎంఆర్ వర్మ లాంటి మంచి టెక్నిషియన్స్ ను ఇచ్చారు. వారి నమ్మకం వలనే ఇది సాధ్యపడింది. ఏ2 పిక్చర్స్ కి ఎప్పుడూ రుణపడి వుంటాను. గోపి సుందర్ గారు ఇచ్చిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయి. ఇందులో బ్రహ్మ పాత్ర సౌత్ ఇండస్ట్రీ లో ఒక టాప్ హీరో చేయబోతున్నారు. అది త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఇది సోషియో ఫాంటసీ, మైథాలజీ, లవ్, ఫుల్ ఎంటర్ టైనర్. మీ అందరి ప్రోత్సాహం కావాలి అని కోరారు.
గోపి సుందర్ మాట్లాడుతూ.. దర్శకుడు భవానీ చెప్పిన కథ చాలా నచ్చింది. ఇందులో ఆరు పాటలు ఉంటాయి. ఇది ఫుల్ ప్యాకేజ్. సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉంటుంది. అందరూ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మీ అందరి సపోర్ట్ కావాలి అన్నారు.
రియా సచ్దేవ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లో చేయడం చాలా ఎక్సయిటింగ్ గా వుందని.. మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.
కాగా రియా సచ్దేవ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో పోసాని కృష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నరు. సి . రామ్ ప్రసాద్ కెమరామెన్ గా పని చేస్తుండగా.. స్టార్ కంపోజర్ గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎంఆర్ వర్మ ఎడిటర్ కాగా, రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: