సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు అందులోనూ ఓ 400 కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే దానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈరేంజ్ సినిమాను తీయడానికి మేకర్స్ చాలా టైమ్ కూడా తీసుకుంటారు. కానీ కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు ఎలాంటి సినిమా అయినా సరే చాలా ఫాస్ట్ గా తీసేస్తుంటారు. అందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పేరు కూడా చేరుతుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. రామాయణం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఇలాంటి సినిమాను తీయడానికి వేరే డైరెక్టర్స్ అయితే కనీసం ఒక సంవత్సరం అయినా తీసుకొని ఉండేవాళ్లు.. కానీ ఓం రౌత్ మాత్రం కేవలం 103 రోజుల్లో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అది కూడా కరోనా ఉన్న టైంలోనే ఈసినిమాను ప్రారంభించి ఇంత త్వరగా కంప్లీట్ చేయడంతో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ విషయాన్ని ఓం రౌత్ కూడా తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ‘ఆదిపురుష్ షూట్ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్ చేసిన మ్యాజిక్ను మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
It’s a shoot wrap for Adipurush!!!
A wonderful journey has come to its finish line. Can’t wait to share with you the magic we have created.#Adipurush #103DaysOfShoot pic.twitter.com/prMUp5fA4S— Om Raut (@omraut) November 11, 2021
కాగా మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: