మరోసారి నానికి జోడిగా అను ఇమ్మాన్యుయేల్?

Anu Emmanuel To Pair Up With Natural Star Nani Once Again In Shyam Singha Roy

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘మజ్ను’(2016)తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడింది. స్వల్ప విరామం అనంతరం.. ‘అల్లుడు అదుర్స్’లో ఓ నాయికగా నటిస్తోంది అను. ఇదిలా ఉంటే.. తాజాగా అను ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో నాని కథానాయకుడిగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్‌ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు కథానాయికలకు స్థానముండగా.. వారిలో ఒకరిగా అను ఇమ్మాన్యుయేల్ ఎంపికైందని టాక్. త్వరలోనే అను ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.

మరి, ‘మజ్ను’తో మురిపించిన నాని, అను జోడీ.. ‘శ్యామ్ సింగ రాయ్’తోనూ అలరిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.