`జై సింహా` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక నాయికలుగా నటిస్తుండగా… భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శనివారం థాయ్లాండ్లో మొదలైంది. నిరవధికంగా జరుగనున్న ఈ భారీ షెడ్యూల్లో నాయకానాయికలతో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అలాగే… ఓ పాటను కూడా చిత్రీకరించనున్నట్టు సమాచారం. బాలయ్య కెరీర్లో 105వ చిత్రంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2019 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుందని సమాచారం.
[subscribe]
[youtube_video videoid=7ns8xwVHYlQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: