స‌ంక్రాంతి సీజ‌న్ లో కొన‌సాగుతున్న‌ `సొంత ప‌లుకులు` ట్రెండ్

New Age Heroines Continue This Trend For Sankranthi Movies

ఈ త‌రం క‌థానాయిక‌లు త‌మ పాత్ర‌ల‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ… న‌ట‌న ప‌రంగా `ప‌రిపూర్ణ‌త్వం` ఉండేలా అడుగులు వేస్తున్నారు. తెలుగమ్మాయిలే కాదు ప‌ర‌భాషకు చెందిన క‌థానాయిక‌లు కూడా ఇందులో భాగం అవుతుండ‌డం హ‌ర్ష‌ణీయం. మ‌రీ ముఖ్యంగా.. తెలుగువారికి ప్రీతిపాత్ర‌మైన సంక్రాంతి సీజ‌న్ లో వ‌చ్చే సినిమాల విష‌యంలో… ఐదేళ్ళుగా ప్ర‌తీ సంవ‌త్స‌రం `సొంత ప‌లుకులు`తో మురిపిస్తున్న నాయిక‌లు ఉంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

2016లో ర‌కుల్ ప్రీత్ సింగ్ (నాన్న‌కు ప్రేమ‌తో)తో మొద‌లైన ఈ `సంక్రాంతి ఓన్ వాయిస్` ట్రెండ్ ని.. 2017లో `శ‌త‌మానం భ‌వ‌తి` కోసం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, 2018లో `అజ్ఞాత‌వాసి` కోసం కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, `జై సింహా` కోసం హ‌రిప్రియ కొనసాగించారు. ఇక గ‌త ఏడాది (2019)లో `ఎఫ్ 2` కోసం త‌మ‌న్నా, మెహరీన్ కంటిన్యూ చేయ‌గా.. 2020లో `స‌రిలేరు నీకెవ్వ‌రు` కోసం ర‌ష్మిక‌, `అల వైకుంఠ‌పుర‌ములో` కోసం పూజా హెగ్డే కూడా అదే బాట ప‌ట్టారు. మ‌రి.. రానున్న సంక్రాంతి రిలీజెస్ లోనూ ఈ ట్రెండ్ కొన‌సాగుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =