గత ఏడాది సంచలనం ‘ఆర్ ఎక్స్ 100’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్పుత్. ఆ సినిమాలో బోల్డ్గా నటించి కుర్రకారు మనసును దోచుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… స్వల్ప విరామం అనంతరం వరుసగా మూడు ప్రాజెక్ట్లను అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా… ఇవన్నీ కూడా నటిగా తనకు సవాల్ విసిరే పాత్రలేననీ తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పాయల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫీమేల్-సెంట్రిక్ మూవీగా రూపొందిన ‘ఆర్ డి ఎక్స్ లవ్’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నానని… ఇందులో గ్రామాన్ని దత్తత తీసుకుని, ప్రజల సమస్యలను తీర్చే యువతిగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది పాయల్. అలాగే… ‘వెంకీ మామ’లో విక్టరీ వెంకటేష్ సరసన కథానాయికగా నటిస్తున్నానని… కోపం వస్తే హిందీలో మాట్లాడే హిందీ టీచర్గా ఫన్ జనరేట్ చేసే క్యారెక్టర్లో నటిస్తున్నానని తెలిపింది. ఇక… మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందుతున్న ‘డిస్కో రాజా’లో మూగ, చెవిటి అమ్మాయిగా ఓ ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నానని పేర్కొంది.
మొత్తమ్మీద… వైవిధ్యమైన పాత్రలకే ఓటేస్తూ ముందుకు సాగుతున్న పాయల్… ఈ మూడు చిత్రాలతో ఎటువంటి విజయాలను అందుకుంటుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: