యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.అందులో చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్నాడు .హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈసినిమా నుండి అప్డేట్ రానుంది. ఈనెల 27న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.టీజర్ కూడా రెడీ అయిపోయిందట. టీజర్ అయితే అదిరిపోయిందని టాక్.మరి ఎప్పుడు వదులుతారో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సీఎస్ , చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.ఈఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈసినిమా కాకుండా సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు ,భైరవం అలాగే హైందవ సినిమాలు చేస్తున్నాడు.టైసన్ నాయుడుని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా రోజులనుండి షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమి బయటికి రాలేదు.14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.
భైరవం కూడా తుది దశకు చేరుకుంది.సాయి శ్రీనివాస్ తోపాటు మంచు మనోజ్ ,నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు. మేలో రిలీజ్ కానుంది.కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఇక హైందవ డిఫ్రెంట్ సబ్జెక్టు తో వస్తుంది.భారీ బడ్జెట్ తో భారీ విఎఫ్ఎక్స్ తో రానుంది.లుధిర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తుండగా అకల్ట్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. మరి ఈ నాలుగు సినిమాలు సాయి శ్రీనివాస్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: