దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు ఆడియన్స్ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఎప్పుడో మొదలుకావాల్సిన ఈసినిమా లేట్ అవుతూ వస్తుంది. దానికి కారణం లేకపోలేదు. కార్తీ అలానే లోకేష్ కనగరాజ్ ఇద్దరూ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఈసినిమా పట్టాలెక్కలేకపోయింది. ఇప్పుడు కూడా కొత్త ప్రాజెక్ట్ లు లిస్ట్ లో ఉన్నాయి. దీంతో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే కొంచం టైం పడుతుంది. అయితే తాజాగా ఈసీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు కార్తీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీ ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ నిజానికి వచ్చే ఏడాది జనవరిలో ఈసినిమా షూట్ ను స్టార్ట్ చేయాల్సి ఉంది.. అయితే లోకేష్ రజనీకాంత్ సర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూట్ లేట్ అవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: