ఇప్పటి వరకూ ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మరో ప్రముఖ ఎడిటర్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే కదా. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గతకొద్దికాలంగా బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఈనేపథ్యంలో చిత్ర పరిశ్రమనుండి ప్రముఖులు అందరూ ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గౌతమ్ రాజు కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి గారు 2 లక్షల సాయం
టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. pic.twitter.com/g2pxpmz2l4
— Suresh Kondeti (@santoshamsuresh) July 6, 2022
ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా గౌతంరాజు మృతిపట్ల స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియచేస్తూ.. ఆయన కుటుంబానికి రెండు లక్షల రూపాయలను సాయం అందించారు. దర్శక, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా ఈ సాయాన్ని అందజేశారు చిరు. ఈ మేరకు గౌతం రాజు కుటుంబ సభ్యులకు సాయాన్ని అందచేసిన భరద్వాజ…తమకు అండగా ఉంటామని, ధైర్యం కోల్పొవద్దని మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు వెల్లడించారు.
కాగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 850పైగా చిత్రాలకు ఎడిటర్గా పని చేసి.. చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎడిటర్ గా పరిచయమైన ఆయన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల నుంచి ఈతరం స్టార్ల వరకు అందరి చిత్రాలకు ఎడిటర్గా పనిచేసి మెప్పించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: