మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 200 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు , పల్లెటూరి యువతి రామలక్ష్మి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “రంగస్థలం ” మూవీ ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రాజమౌళి తరువాత టాలీవుడ్ కు క్రేజ్ ని తెచ్చిపెట్టిన దర్శకుడిగా సుకుమార్ రెండవ స్థానంలో నిలిచారు. ఆయన తెరకెక్కించిన “పుష్ప” దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో “పుష్ప ” మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దర్శకుడు సుకుమార్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురము లో ” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను గోల్డ్ మైన్స్ సంస్థ దేశవ్యాప్తంగా రిలీజ్ చేయనుంది. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం ” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి లో థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయాలని గోల్డ్ మైన్స్ సంస్థ ప్లాన్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: