జీతూ జోసఫ్ దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో దృశ్యం రీమేక్ దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. అసలు ఈసీక్వెల్ ఉంటుందో లేదో అన్న డౌట్ నుండి సినిమా పట్టాలెక్కింది.. అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో చాలా తొందరగా సినిమా షూటింగ్ ను కూాడా పూర్తి చేశారు. 50రోజులు మాత్రమే ఈసినిమా షూటింగ్ కు టార్గెట్ పెట్టుకున్నారు.. కానీ 50రోజుల కంటే తక్కువగానే సినిమా పూర్తయినట్టు తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ ఏడాదే ఈసినిమాను రిలీజ్ చేయాలన్న నేపథ్యంలో అస్సలు గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ను చేశారు. రీసెంట్ గానే వెంకీ తన పార్ట్ ను పూర్తిచేసుకోగా.. ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తిచేసుకంది. అనుకున్నదానికంటే ముందే.. అంటే 50 రోజులు ప్లాన్ చేస్తే 47 రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైందట. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేయడం అంటే గ్రేట్ అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుందని సమాచారం. పరిస్థితులన్ని అనుకూలిస్తే త్వరలోనే రిలీజ్ డేట్ని ప్రకటిస్తారట చిత్ర బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తొలి భాగం రీమేక్లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్ రీమేక్లోనూ నటిస్తున్నారు.
కృతిక, ఎస్తేర్, నదియా, వారితో పాటు సంపత్ రాజ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: