“RED” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అమృతా అయ్యర్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా “మూవీ తో ప్రేక్షకులను తన అందం , అభినయం తో అలరించారు. అమృత ప్రస్తుతం “అర్జున ఫల్గుణ”, “హనుమాన్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత జంటగా తెరకెక్కిన “అర్జున ఫల్గుణ” మూవీ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో అమృతా అయ్యర్ పాత్రికేయులతో ముచ్చటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమృత మాట్లాడుతూ .. “అర్జున ఫల్గుణ” మూవీలో స్నేహానికి అమితంగా విలువనిచ్చే యువతిగా నటించాననీ , ఐదుగురు ప్రాణస్నేహితుల కథ ఇదనీ , ఇందులో స్నేహితుడికి సాయం చేసేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే యువతిగా తాను కనిపిస్తాననీ ,రాజమండ్రి బ్యాక్డ్రాప్లో వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు తేజ మార్ని ఈ సినిమాను తెరకెక్కించారనీ , కుటుంబ విలువలతో పాటు చక్కటి థ్రిల్ను పంచుతుందనీ , ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడ్డామనీ , కొండలపై కొన్ని రోజులు షూట్ చేశామనీ , అక్కడకు వెళ్లడానికే ప్రతి రోజు మూడు గంటలు నడవాల్సివచ్చేదనీ , నటిగా సవాళ్లతో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నాననీ , గ్లామర్ పాత్రలు చేయననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: