సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రాశీఖన్నా బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రాశీఖన్నా హిందీ వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నారు. ఉంది. “ఫ్యామిలీ మెన్” సిరీస్ దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందిస్తున్న ఓ వెబ్సిరీస్లో షాహిద్కపూర్ కు రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. అజయ్దేవ్గణ్తో కలిసి “రుద్ర” వెబ్ సిరీస్లో కీలక పాత్రలో రాశీఖన్నా నటిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి రాశీఖన్నా మాట్లాడుతూ .. ఓటీటీ వేదికలు కథానాయికలకు ఓ వరంగా మారాయనీ , సవాళ్లతో కూడిన పాత్రల్ని ఎంచుకోవడానికి, ప్రయోగాత్మక ఇతివృత్తాల్లో భాగంకావడానికి డిజిటల్ ప్లాట్ఫామ్స్కు మించిన మార్గం లేదనీ , ఓపికతో ఎదురుచూస్తే మనసుకు నచ్చిన పాత్రలు వరిస్తాయనీ, “రుద్ర” వెబ్ సిరీస్లో ఎంపిక చేసేముందు తాను ఆడిషన్స్లో పాల్గొన్నాననీ ,ఆడిషన్స్లో నెగ్గి అవకాశం సొంతం చేసుకుంటే అంకితభావంతో పనిచేస్తామనీ , ప్రస్తుతం స్టార్డమ్ అనే పదానికి రోజులు చెల్లిపోతున్నాయనీ , ప్రతి సినిమాకు ఉత్తమ ప్రతిభ కనబరిస్తేనే ఇండస్ట్రీలో ముందుకు సాగుతామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: