టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు.వచ్చే నెల నుంచి ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతకుముందు ఫ్రెండ్స్ తో గోవా లో ఎంజాయ్ చేసిన సమంత ఇప్పుడు యాత్రలకు శ్రీకారం చుట్టారు. సమంత తన బెస్ట్ ఫ్రెండ్ ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలసి ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ యాత్రకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను శిల్పారెడ్డి తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. హెలీకాఫ్టర్ ముందు సామ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ టేకాఫ్.. మొదట యమునోత్రి కి వెళుతున్నామని శిల్పారెడ్డి వెల్లడించారు. చార్ ధామ్ యాత్ర.. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్.. అంటూ క్యాప్షన్ పెట్టారు. టూర్ లో భాగంగా గంగానదిని అక్కడ వశిష్ట తీరాన్ని సందర్శించారని సమాచారం. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: