కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్” మలయాళ మూవీ రీమేక్ “గాడ్ ఫాదర్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ “వేదాళం” తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తెరకెక్కనున్న “భోళా శంకర్”మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్లుక్ విడుదల చేశారు. చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.”భోళా శంకర్ ” మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనీ , వచ్చే వారం నుంచి ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందనీ సమాచారం. “భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్తో కనిపించబోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: