యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదే శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు పలు సినిమాలను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే
ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజన్ సినిమాస్, బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా నేడు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అద్దంలో హీరో హీరోయిన్ కనిపిస్తుండగా.. ఆది దాని లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు లుక్ ను చూపించారు. ఈసినిమా ఫస్ట్ లుక్ అయితే డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటుంది.
ఇక ఈసినిమాలో ఆది సరసన నువేక్ష హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: