వాడు వీడు సినిమాలో కలిసి నటించిన విశాల్ ఆర్య ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతోన్నారు. విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా హైద్రాబాద్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ను కూడా స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Proudly Presenting The #EnemyTeaser
Hindi – https://t.co/KxO2WEHq1z
— Vishal (@VishalKOfficial) July 24, 2021
కాగా ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, మృనాలినీ రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఈ చిత్రంతోపాటు శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశాల్. ‘విశాల్ 31’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. ఇక ఈసినిమాను విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బేనర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యాస్ట్రో యువన్ శంకర్రాజా సంగీతం అందిస్తుండగా, బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: