నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అందరూ అనుకుంటుండగా ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమాను స్టార్ట్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం హైదరాబాద్లో జరిపారు. ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. . ఈ వేడుకలో ప్రభాస్తోపాటు అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ముహూర్తపు షాట్కి ప్రభాస్ క్లాప్ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ ఫొటో కూడా షేర్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ పై ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టింది. “ఇది ప్రాజెక్ట్ కే లో మొదటి రోజు, ముందు రాబోయే వాటి కోసం ఆలోచిస్తేనే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది”. అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దీపికా పోస్ట్ చేసింది.
View this post on Instagram
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: