ఇన్ని రోజులు కరోనా వల్ల రెస్ట్ తీసుకున్న తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సెట్స్ పైకి సందడి చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ చేతిలో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో రానా-పవన్ కాంబినేషన్ లో వస్తున్న మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా. ఈరెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ అందరూ షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కూడా రెడీ అవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదట సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్గా రూపొందుతున్న సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకోగా తాజా షెడ్యూల్ ను జూలై 12వ తేదీ నుండి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఈసారి గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లోనే ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం.
కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈసినిమాను నిర్మిస్తున్నాడు. రానా సరసన ఐశ్వర్యరాజేష్ నటిస్తుంది. పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటించనునన్నట్టు తెలుస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: