బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ భారీ రేంజ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ విషయంలో పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. శృతి హాసన్, త్రిష లాంటి హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. ఈనేపథ్యంలో బాలయ్య సరసన నటించే అవకాశం మెహ్రీన్ కు దక్కిందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈవార్తలపై స్పందించిన మెహ్రీన్ తాజాగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతానికి తాను సంతోష్ శోభన్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రంలోనే నటిస్తున్నానని. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అలాంటి వార్తలను నమ్మొద్దు.. ఒకవేళ ఏదైనా కొత్త సినిమా ఓకే చేస్తే నేనే చెప్తా అంటూ ట్వీట్ లో పేర్కొంది.
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) June 27, 2021
ప్రస్తుతం మెహ్రీన్ మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా కూడా చేస్తోంది. ఇక ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకుంది మెహ్రీన్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ తో మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. పరిస్థితులు నార్మల్ గా ఉంటే ఇప్పటికే పెళ్లి అయిపోయిఉండేది. కానీ ఈలోపే లాక్ డౌన్ అమలులోకి రావడంతో పెళ్లి వాయిదా వేసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: