సాగరచంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్ప నుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలవ్వగా పలు కీలక సన్నివేశాలను కూడా చీత్రీకరించారు. ఇక ఈసినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే కరోనా సేకండ్ వేవ్ ఊపందుకోవడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ లు ఆరంభమవుతున్నాయి దీనిలో భాగంగానే ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం జులై మొదటి వారం నుండి ఈసినిమా షూటింగ్ రీస్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పోలీస్ స్టేషన్ సెట్ వేసారట. పోలీస్ స్టేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. అంతేకాదు దీనితోపాటు ఓ హాస్టల్ సెట్ కూడా వేసినట్టు తెలుస్తోంది.
కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈసినిమాను నిర్మిస్తున్నాడు. రానా సరసన ఐశ్వర్యరాజేష్ నటిస్తుంది. పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటించనునన్నట్టు తెలుస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: