మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరిగిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “మూవీ పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “పుష్ప “మూవీ షూటింగ్ జూలై నెలలో పునః ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ ను గోవా లో ప్లాన్ చేసినట్టు , లొకేషన్స్ ఎంపిక పూర్తి అయినట్టు సమాచారం. గోవా షూటింగ్ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీన్స్ , అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించడానికి దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారు. దర్శకుడు సుకుమార్ , హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: