హీరో నాగశౌర్య వరస మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్వంత బ్యానర్ తో పాటు ఇతర బ్యానర్స్ లోనూ నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోని క్యారెక్టర్ కై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ సాధించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా “వరుడు కావలెను “మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి “, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె పి రాజేంద్ర దర్శకత్వంలో “పోలీసు వారి హెచ్చరిక” మూవీస్ కు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ కి నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: