రష్మిక మందన్నకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అసలు ఇప్పటివరకూ బాలీవుడ్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకముందే నార్త్ లో కూడా క్రేజ్ తెచ్చుకొని నేషనల్ క్రష్ అయింది. అంతేకాదు బెంగుళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 గా రెండోసారి మొదటిస్థానంలో నిలిచింది. ఇక తెలుగులో పలు సినిమాలు చేస్తూనే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీ అయిపోయింది ఈభామ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా జులై మొదటివారం నుండి పుష్ప సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బాలీవుడ్ లో బిజీగా ఉన్న రష్మిక పుష్పకోసం బల్క్ డేట్స్ కేటాయించనున్నట్టు తెలుస్తుంది. దాదాపు నెలరోజులు పుష్ప కోసమే కేటాయించనుందట. ఈసినిమా షూటింగ్ పూర్తయిన తరువాతే బాలీవుడ్ వెళ్లి అక్కడి సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. రెండు పార్టుల్లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుంది. వీటితోపాటు ప్రస్తుతం బాలీవుడ్లో రెండు ప్రాజెక్ట్లతో బిజీగ ఉంది. ఇక బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్లో మరో ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: