బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు ఒక్కోక్కరిగా తెలుగు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నసంగతితెలిసిందే కదా. ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమా లైగర్ లో అనన్య పాండే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా, ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొనె, ఇంకా గని సినిమాలో సాయి ముంజ్రేకర్ ఇలా పలువురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు అది కూడా చిరుతో జోడీ కట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతంమెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు మూడు కొత్త సినిమాలను ఓకే చేసిన సంగతి తెలిసిందే కదా. అందులో ఒకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్, మరో చిత్రం తమిళ చిత్రం వేదాళం రీమేక్. బాబితో స్ట్రయిట్ తెలుగు సినిమా. ఇక లూసిఫర్ రీమేక్ను ఎ.మోహన్రాజా తెరకెక్కిస్తుండగా, వేదాళం రీమేక్లను మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ నుండి లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అయితే వేదాళం రీమేక్ కంటే ముందుగానే బాబి సినిమా ట్రాక్ ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరోవైపు బాబి కూడా అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిగాయని.. అంతేకాదు ఈసినిమా కోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసిందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: