మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా”రంగస్థలం “మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు గా రామ్ చరణ్ , వరలక్ష్మి గా సమంత , రంగమ్మత్త గా అనసూయ ,కుమార్ బాబు గా ఆది పినిశెట్టి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “రంగస్థలం “మూవీ పలు అవార్డ్స్ అందుకుంది. 3 సంవత్సరాల తరువాత ఇప్పుడు “రంగస్థలం “మూవీ అదే పేరుతో తమిళ డబ్బింగ్ వెర్షన్ ను 7జీ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఏప్రిల్ 30 వ తేదీ తమిళనాడు లో 300 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తుంది. ఒక డబ్బింగ్ మూవీ కరోనా టైమ్ లో ఇంత భారీ ఎత్తున రిలీజ్ కావడం విశేషం . చిత్ర యూనిట్ “రంగస్థలం “మూవీ తమిళ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: