శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివిశేష్ హీరోగా నటిస్తోన్న సినిమా మేజర్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ కూడా చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముంబై తాజ్ హోటల్ లో ఈ ఘటన జరిగింది. దీనికి తాజ్ హోటల్ చాలా ఇంపార్టెంట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే హోటల్ వద్ద షూట్ చేయడానికి అనుమతి ఇవ్వనందున సెట్ అవసరం అయ్యింది.
తాజ్ హోటల్ కొలతలు తీసుకునేందుకు.. నేను నా బృందం హోటల్ లో నాలుగు రోజులు గడిపాం. రియాలిటీకి దగ్గరగా ఉండటానికి హోటల్ లో ఉన్న సమయంలో ప్రతి నిమిషం అక్కడ విషయాల్ని గమనించాం. దానిపై గంటల కొద్దీ సమయం పరిశోధనలు చేసామని.. ఈ సెట్ ను నిర్మించడానికి 500 మంది 10 రోజులకు పైగా పనిచేశారు..గ్రాండ్ మెట్ల రూపం.. టాటా విగ్రహం, M.F. హుసేన్ జీ కొన్ని ఐకానిక్ పెయింటింగ్స్ కూడా ఈ సెట్లో ఉంటాయని తెలిపాడు.
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది.మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మేజర్ సినిమా జులై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: