విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అంతేకాదు అక్కడికి వెళ్లిన విజయ్ అక్కడ బాలీవుడ్ భామలతో పార్టీలు చేస్తూ బిజీ గా వున్నాడు. తాజాగా `లైగర్` టీమ్ అంతా ప్రత్యేకంగా ఇటీవల ఓ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో కరణ్ జోహార్, చార్మి, పూరి, విజయ్దేవరకొండతో పాటు బాలీవుడ్ హాట్ బేబ్స్ కియారా అద్వానీ, సారా అలీఖాన్ పాల్గొన్నారు.ఇక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో రమ్య కృష్ణ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు మథర్ గా నటించనున్నారు. ఇక ఈమె కూడా తాజాగా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆమెవిజయ్ తో సెట్లో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ సరైన కంపెనీ దొరికితే షూటింగ్ కూడా పార్టీలాగ ఉంటుంది అని పేర్కొంది.
View this post on Instagram
కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: