మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ డేట్ ను కాస్త వినూత్నంగా ప్రకటించారు. ఫిబ్రవరి 26వ తేదీన మధ్యాహ్నం 1.24 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు శ్రీ సింహా తన ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశాడు.
Adhi Sangathi! The fun packed teaser of #ThellavaritheGuruvaram will be out on 26th Feb at 1:24PM 🤩
▶️ https://t.co/YWQexpNcsH#HBDSimhaKoduri@Simhakoduri23 @gellimanikanth @kaalabhairava7 @SaiKorrapati_ @Benny_Muppaneni @VaaraahiCC @Loukyaoffl @Chitrashukla73 @NarangMisha pic.twitter.com/WEgH1qWDwH
— Sri Simha Koduri (@Simhakoduri23) February 23, 2021
ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష, శరణ్యా ప్రదీప్, గిరిధర్, ప్రియ, రవివర్మ, పార్వతి, సిరి హనుమంత్, మౌర్య, పద్మావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కలర్ ఫొటో’ లాంటి మంచి సినిమాను అందించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన కాలభైరవానే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: