కరోనా మహమ్మారి కారణం గా షూటింగ్స్ నిలిచిపోవడంతో సినీ సెలబ్రిటీస్ 4 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు.సినీ సెలబ్రిటీస్ తమ తమ వ్యాపకాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత తన ఇంటి టెర్రస్ పై ఆర్గానిక్ ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్న విషయం తెలిసిందే. తనకెంతో సంతోషాన్ని ఇచ్చే వ్యాపకం ఇది అని సమంత చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో కొంతమంది డ్యాన్స్ , కుకింగ్ , సంగీతం , రచనా వ్యాసంగం వంటి వాటితో తమలోని సృజనాత్మకతకు పదును పెడుతున్నారని, కానీ తాను చేస్తున్న పని అందరు చేయగలిగేదేనని సమంత చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించగానే ప్రజలు షాక్ కు గురి అయ్యారని, సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకున్నవస్తువులు ఎన్నాళ్ళు వస్తాయో తెలియదని , కరోనా క్లిష్ట పరిస్థితులలో బయటకు వెళ్ళాలంటే భయం అని , ఆహారాన్ని విలువైనదిగా మనం గుర్తించలేదని , కరోనా మంచి పాఠాన్ని నేర్పిందని , అందుకే ఇంటి టెర్రస్ పై ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టానని , పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇంట్లోనే వ్యవసాయం చేసుకొనడం ఒకటే మార్గమని, ఆర్గానిక్ ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివని సమంత చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: