ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే అది సోనూసూద్ పేరే. రీల్ లైఫ్ లో విలన్.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయిపోయాడు అందరికీ. కరోనా వల్ల ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచాడు. ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్లలో వారి స్వస్థలాలకు చేర్చారు. ఎంతో మంది పేదలకు సాయం చేసాడు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కుటుంబాలకు.. దాదాపు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానని కూడా చెప్పాడు. ఇక ఇటీవల రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇవ్వడం, జాబ్ కోల్పోయిన మహిళకి ఉద్యోగం కల్పించడంతో అందరూ సోనూసూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు మనిషి రూపంలో ఉన్న దైవం అంటూ మరీ పొగడ్తలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. సోనూసూద్ ని చిరంజీవి నటిస్తున్న చిత్రంలో కీలక పాత్రకు తీసుకున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సోనూ సూద్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పాత్ర నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు. మరి ఇందులో ఎంతో నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ చూడాల్సిందే.
పూరీ జగన్నాధ్ సినిమా సూపర్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్.. ఆ తరువాత వచ్చిన అరుంధతి మాత్రం కెరీర్ ను మార్చేసింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: