ఫిదా సినిమాలో తన నటనతో అందర్నీ ఫిదా చేసిన నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం పాత్ర ప్రాధాన్యమైన రోల్స్ మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. నాని కొత్త సినిమాలో సాయి పల్లవిని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని ‘శ్యాం సింగ రాయ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి అయితే బావుంటుందని అనుకుంటుందట చిత్రయూనిట్. ప్రస్తుతం చిత్రం యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందనీ, పాత్ర ఆమెకు నచ్చిందనీ అంటున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉందనీ, అందుకే ఆమె ఒప్పుకోవచ్చనీ సమాచారం. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో. కాగా గతంలో నాని, సాయిపల్లవి కలిసి ‘ఎం.సి.ఏ’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: