డిస్కవరీ ఛానల్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అద్భుతమైన సన్నివేశాల్ని అరుదైన సన్నివేశాలను.. చూపించడం ఈ ఛానల్ స్పెషాలిటీ. అందుకే ఈ ఛానల్ కు చాలా మంది ఫెవెరెట్స్ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు జాతీయ బాషలకే పరిమితమవ్వగా ఇప్పుడు ప్రాంతీయ ప్రజలకు కూడా దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే సరికొత్త ప్లాన్ తో వచ్చింది డిస్కవరీ ఛానల్. అనేక భాషల్లో తన వీక్షకులను పెంచుకునేందుకు రోజు రోజుకు మరింత ప్రయత్నాలు చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘వైల్డ్ కర్ణాటక’ అనే కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే దీనికోసం గాత్ర దానం ఇవ్వాలని నటుడు ప్రకాశ్ రాజ్ను సంస్థ సంప్రదించగా… ప్రకాష్ రాజ్ కూడా దానికి అంగీకరించారు. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ లో రూపుదిద్దుకున్న ఆ కార్యక్రమం జూన్ 5 శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. తమిళం, తెలుగు భాషల్లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ చెబుతుండగా, డిస్కవరీ చానల్ ప్రోమో రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా భావిస్తూ ప్రకాశ్ రాజ్ తన గొంతుతో ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. దీనికి అనేక మంది సెలెబ్రెటీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేస్తున్నారు. ఇక దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించి “మీ ఆసక్తికర వర్ణన కోసం ఎదురుచూస్తుంటాం, ప్రకాశ్ రాజ్ ఇక కానిచ్చేయండి” అంటూ ట్వీట్ చేశారు.
Looking forward to your interesting narrative !! @prakashraaj way to go… https://t.co/aPNpGqjF8A
— Mahesh Babu (@urstrulyMahesh) May 26, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: