‘దృశ్యం’.. 2013లో విడుదలైన ఈ మలయాళ చిత్రం మాలీవుడ్లో వసూళ్ళ వర్షం కురిపించి అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సింహళీ భాషల్లోనూ పునర్నిర్మితమై ఆయా చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. గత దశాబ్దంలోనే ఎక్కువ భాషల్లో రీమేక్ అవడమే కాకుండా.. చైనాలో రీమేక్ అయిన తొలి భారతీయ చిత్రంగానూ చరిత్ర సృష్టించింది. కట్ చేస్తే.. 7 ఏళ్ళ తరువాత ‘దృశ్యం’కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘దృశ్యం’కి కొనసాగింపుగా తెరకెక్కనున్న ఈ సినిమాలోనూ మాతృకలో భార్యాభర్తలుగా నటించిన మోహన్ లాల్, మీనానే నటించనున్నారని వెల్లడించాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మిగిలిన తారాగణంకు సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని కూడా తెలిపాడు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ సీక్వెల్ను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నట్టు జీతూ చెప్పుకొచ్చాడు.
మరి.. ‘దృశ్యం’ లాగే ఈ సీక్వెల్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: