బాహుబలి సినిమా అంటే మొదట మనకు గుర్తొచ్చేది బాహుబలి ప్రభాస్-భళ్లాలదేవ రానా. వారిద్దరూ లేకపోతే ఆ సిరీస్ లేనట్టే అని చెప్పొచు. ఇక ఈ సినిమాతో అటు ప్రభాస్, రానా కెరీర్ రేంజ్ ఏ కాదు.. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇక ఇదిలా ఉండగా వీరిద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ కథ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ గా రానా అయితే బావుంటుందని.. తాను అయితే ఆ పాత్రకు సరైన న్యాయం చేస్తాడని అనుకుంటున్నారట. అసలు ఈ వార్తలు రావడానికి కారణం రానా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటోనే కారణం. ఆ ఫోటో తీసింది నాగ్ అశ్విన్. ఈ నేపథ్యంలో రూమర్స్ అందుకున్నాయి. మరి చూద్దాం ఈ వార్తలపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇస్తాడేమో.
కాగాప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. మరో వైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా విరాట పర్వం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా కొంత షూటింగ్ ను జరుపుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: