కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక మొన్ననే ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా అని ట్వీట్ చేసి ఫ్యాన్స్ కి ప్రామిస్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేసాడు రామ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. సినిమా అనేది కొందరికి ప్యాషన్, చాలా మందికి వ్యాపారం…ఇక మిగిలిన వారికి జూదం అని చెప్పుకొచ్చారు. అయితే రామ్ ఈ ట్వీట్ ఎందుకు పెట్టాడా అన్న చర్చలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో పలువురు ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ నటిస్తున్న రెడ్ మూవీ కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని.. థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు పెట్టడబ్బా.? రామ్ ట్వీట్ వెనుక వున్న ఆంతర్యం ఏంటా అని అనుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయడాన్ని సమర్ధిస్తున్నాడా లేక విమర్శిస్తున్నాడా అనేది స్పష్టం కావడం లేదు.
The thing about the Movie Industry is..
It’s a Passion for a few..
a Business for most..
& a Gamble for the rest..Everyone sees it from their own perspective..#OTT #Theatrical #RAndoMthoughts
— RAm POthineni (@ramsayz) May 18, 2020
కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ బిసినెస్ భారీ రేంజ్ లోనే నడుస్తుంది. మరి చూద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: