కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కై ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయాన్ని పలువురు సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి గార్డెనింగ్ వంటి పనులతో బిజీగా ఉన్నారు. చిరంజీవి సోషల్ మీడియా లో జాయిన్ అయిన నాటి నుండి కరోనా అవగాహన పై పలు మెసేజ్ లు , వీడియో లు పోస్ట్ చేస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. సినీ కార్మికుల సహాయార్ధం కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను ప్రారంభించి వారికి సేవలందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The paths we take should always be clean #LockdownActivities #StayHomeStaySafe pic.twitter.com/7Ie4frsTut
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 16, 2020
చిరంజీవి తన ఇంటిలో నడిచే రహదారి ని స్వయంగా శుభ్రపరుస్తున్న వీడియో ను పోస్ట్ చేశారు. రహదారులు క్లీన్ గా ఉండాలని, ఇంటితో పాటు పరిసరాలు కూడా క్లీన్ గా ఉంచుకోవాలని ట్వీట్ చేశారు. చెప్పడమే కాకుండా తాను ఆచరిస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉంటూ లాక్ డౌన్ సమయాన్ని చిరంజీవి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా “ఆచార్య” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పరిస్థితులు చక్కబడిన తరువాత “ఆచార్య” మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































