రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో రామ్ చరణ్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ ఏం సినిమా చేస్తాడో అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. టాలీవుడ్లోకి మనోజ్ ‘అహాం బ్రహ్మాస్మి’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో… ఈ సినిమా ఓపెనింగ్కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టాడు రామ్ చరణ్. ఇక అంతే అప్పుడే వీరిద్దరికమినషన్ లో సినిమా రాబోతున్నట్టు జోరుగా వార్తలు అందుకున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. అది కూడా రీమేక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘బిల్లా రంగా’ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిల్లా రంగాలో.. చిరు, మోహన్ బాబులు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాని కేయస్ఆర్దాస్ దర్శకత్వం వహించగా.. పింజల నాగేశ్వర రావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకే రీమేక్ చేయాలనీ చూస్తున్నారట. సినిమాను ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు రీమేక్ చేయాలనున్నట్టు సమాచారం. మరి ఇది నిజమేనా.. ఇందులో ఎంత నిజముందో? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: