తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కూడా తీసాడు. ఇప్పుడు పెద్ద ఛాన్సే కొట్టేశాడు. వెంకీతో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నాట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పి.పి ప్రొడక్షన్లో తరుణ్ భాస్కర్ యాంకర్ గా ‘‘నీకు మాత్రమే చెప్తా’’ ప్రోగ్రాం రాబోతుంది. ప్రజా ప్రభాకర్, శ్రీకాంత్ ఈ కార్యక్రమానికి నిర్మాతలు. శరత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ మార్చి 14 నుండి ఓ టీవీ చానెల్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘నన్ను ఆదరిస్తూ వస్తున్న వారందరికోసం మరో కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్ను ఇంటర్వ్యూ చెయ్యడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. టెలివిజన్లో ప్రోగ్రామ్ చెయ్యడంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇది ఫస్ట్ సీజన్, ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాము. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్తో పాటు రీసెంట్గా విజయాలందుకున్న కొత్త దర్శకులను కూడా ఈ ప్రోగ్రామ్లో పరిచయం చేయబోతున్నాము. నేను వెంకటేష్గారితో చేయబోయే ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతుందని క్లారిటీ ఇచ్చాడు.
మరి వెంకీ ప్రస్తుతం అసురన్ రీమేక్ లో వున్నాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందేమో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: