‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. గతకొద్ది కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చింది రష్మిక. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తను డబ్బింగ్ చెప్పడం పూర్తయిందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
And that’s a wrap! Just finished dubbing for Bheeshma.
Ahhh you guys are going to enjoy this movie!💃🏻👻 pic.twitter.com/ULSWT9UnAa
— Rashmika Mandanna (@iamRashmika) February 3, 2020
[custom_ad]
కాగా రష్మికా మందన్న కథానాయికగా నటిస్తుండగా… హెబ్బా పటేల్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. హెబ్బా పటేల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మహతి సాగర్ సంగీతమందిస్తున్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: