రాజశేఖర్ ‘రాజీనామా’కు ఆమోదం

మా డైరీ ఆవిష్కరణలో మెగా స్టార్ చిరంజీవి, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మధ్య చోటు చేసుకున్న సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, రాజశేఖర్ మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. చిరు మాట్లాడుతున్న సమయంలో రాజశేఖర్ మైక్ తీసుకోవడం… ఆ తర్వాత తాను మాట్లాడటం.. రాజశేఖర్ తీరు పై చిరు అసహనం వ్యక్తం చేయడం అన్నీ కొద్ది క్షణాల్లోనే జరిగిపోయాయి. ఇక రాజశేఖర్ ప్రవర్తనపై అక్కడ వున్న వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసహనానికి గురయ్యారు. రాజశేఖర్ ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ నేపథ్యంలో ‘మా’లో తాను ఉండలేనంటూ హీరో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి కూడా విదితమే. ‘మా’ ఉపాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. మా డైరీ లాంచ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాల కారణంగా రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఇక తాజాగా ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రాజశేఖర్ రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. అంతేకాకుండా కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధతో ఉన్నతస్థాయి క్రమశిక్షణ చర్యల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరి చూద్దాం ఈ వివాదం ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =